ఈ నిర్ణయం టికెట్ దందాలను అరికట్టడానికి తీసుకున్నదని రైల్వే అధికారులు తెలిపారు. కొంతమంది ఏజెంట్లు పెద్ద మొత్తంలో టికెట్లు బుక్ చేసి వాటిని అధిక ధరలకు విక్రయిస్తున్నారని విమర్శలు వచ్చాయి.
ఆధార్ వెరిఫికేషన్ వల్ల నకిలీ బుకింగ్లను నివారించవచ్చని అధికారులు చెప్పారు. సాధారణ ప్రయాణికులకు ఇది ప్రయోజనకరంగా మారుతుందని వారు నమ్ముతున్నారు.
ప్రయాణికులు తమ IRCTC ఖాతాను ఆధార్తో లింక్ చేసుకోవాల్సి ఉంది. లింక్ చేయని పక్షంలో బుకింగ్ నిలిపివేయబడుతుంది.
0 Comments